రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: మంత్రి అచ్చెన్నాయుడు

Must read

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రథమ పౌరురాలిగా విశిష్టమైన సేవలు అందిస్తున్న ద్రౌపది ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి, గిరిజన సమాజం నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ము ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత తమ లక్ష్యాల సాధనలో ముందుకు సాగేందుకు ఆమె జీవితం గొప్ప ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.నిరాడంబరత, సేవా తత్పరత, ప్రజల పట్ల అంకితభావానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతీకగా నిలిచారని మంత్రి కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆమె అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ప్రజాసేవలో ఆమె చూపిస్తున్న నిబద్ధత, కర్తవ్యనిర్వహణ తీరు దేశ ప్రజలందరికీ ఆదర్శమని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయురారోగ్యాలతో, మరింత శక్తితో దేశానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు సేవలు అందించాలని ఆకాంక్షించారు.దేశ అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషికి గౌరవం తెలియజేస్తూ, మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!