అంబేద్కర్ జయంతి వేడుకలు: కీసరలో ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు

Must read

కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కులం, మతం, పార్టీలు, జెండాలు అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు గుండెల్లో పెట్టుకుని పూజించుకునే మహనీయుడు అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు. దేశం ప్రశాంతంగా, సుభిక్షంగా కొనసాగడానికి అంబేద్కర్ చేసిన కృషి ఎంతో కీలకమని తెలిపారు.

అంబేద్కర్‌ను ఒకే వర్గానికి చెందిన నాయకుడిగా చూపించే ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆయన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడని ఈటల రాజేందర్ అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం వల్లే నేడు ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంబేద్కర్ గొప్పతనాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారని, దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర అపారమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

అంబేద్కర్ వంటి మహనీయులు మరణించిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి నివాళులు అర్పించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!