పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం :పవన్ కళ్యాణ్

Must read

పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పంచాయతీరాజ్ శాఖ 2025`26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి.

స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయంపంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి.

రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి.

ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ బాలునాయక్ పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!