రాజేంద్రనగర్‌లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

Must read

రాజేంద్రనగర్‌లో నిర్వహించిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో చేరిన యువతకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1984లో కేవలం రెండు స్థానాల నుంచి ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ, నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. ఈ ప్రస్థానం కార్యకర్తల త్యాగం మరియు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను చూసి ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి ఆధారిత, పారదర్శక పాలన బీజేపీ ద్వారానే సాధ్యమని యువత నమ్ముతోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!