మానవ హక్కులు, బాండెడ్ కార్మిక వ్యవస్థపై వర్క్‌షాప్ :ముఖ్య అతిథిగా సీతక్కకు ఆహ్వానం

Must read

మానవ హక్కుల పరిరక్షణ మరియు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 18న నిర్వహించనున్న “కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ బాండెడ్ లేబర్” వర్క్‌షాప్‌కు మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ మేరకు డీజీ చారు సిన్హా ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చారు సిన్హా మాట్లాడుతూ, సమాజంలో ఇంకా కొనసాగుతున్న బాండెడ్ కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని ఆమె తెలిపారు.

బాండెడ్ కార్మికుల సమస్యలు, వారి పునరావాసం, చట్టపరమైన రక్షణలు, అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు ఆమె తెలియజేశారు. సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో ఈ వర్క్‌షాప్ కీలకంగా పనిచేస్తుందన్నారు.

మంత్రి సీతక్క ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, కార్యక్రమంలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తునా పాల్గొననున్నారు. వారి సూచనలు, సిఫార్సులు భవిష్యత్తులో విధాన రూపకల్పనకు ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

బాండెడ్ కార్మిక వ్యవస్థ అనేది చాలా కాలంగా సమాజంలో ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతోంది. ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపం, సామాజిక అసమానతల కారణంగా చాలామంది ఈ వ్యవస్థలో చిక్కుకుంటున్నారు. దీనిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రజలలో అవగాహన పెంచడం కూడా అత్యంత అవసరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!