నీట్ పరీక్ష లోపాలపై సిపిఐ ఆగ్రహం

Must read

దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష మరోసారి ప్రస్తుత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను బయటపెట్టిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఆ పార్టీ పేర్కొంది.

లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు కేవలం సుమారు 1.30 లక్షలే ఉండటంతో పోటీ తీవ్ర ఒత్తిడితో కూడినదిగా మారిందని సిపిఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళన, అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను వరుస ప్రభుత్వాలు ప్రోత్సహించడమే ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణమని సిపిఐ ఆరోపించింది. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను లాభాల సాధన కోసం వినియోగించే పరిస్థితి నెలకొన్నదని విమర్శించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ మండిపడింది. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది.

ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా రంగాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్ శక్తులపై కఠిన నియంత్రణలు విధించాలని సిపిఐ డిమాండ్ చేసింది.

అలాగే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పరిహారం చెల్లించాలని, అనారోగ్యకరమైన పోటీ, విద్యా వ్యాపారీకరణను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను కఠినంగా నియంత్రించాలని కోరింది. అవసరమైతే అలాంటి సంస్థలను నిషేధించాలని కూడా డిమాండ్ చేసింది.

పారదర్శకమైన, న్యాయబద్ధమైన, విద్యార్థి-హిత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సిపిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!