మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మహిళా ఆగ్రహ యాత్ర

Must read

మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్షాలు చేస్తున్న రాజకీయాలను నిరసిస్తూ నిర్వహించిన “మహిళా ఆగ్రహ యాత్ర”లో వినాయకనగర్ డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి నాయకత్వంలో మహిళలు భారీగా తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ మరియు వారి కూటమి అవలంబిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళా సాధికారతకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి మహిళల అభివృద్ధికి బాటలు వేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు.మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, దీనికి నిరసనగానే ఈ మహిళా ఆగ్రహ యాత్ర నిర్వహించామని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా తమ ఆవేదనను బలంగా తెలియజేశారని అన్నారు.ఈ ఆగ్రహ యాత్రలో వినాయకనగర్ డివిజన్‌కు చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నాయకులు మహిళలకు అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!