విజయవాడ (సెంట్రల్) విజయవాడ సత్యనారాయణ పురం బి ఆర్ టి ఎస్ రోడ్డులోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ వద్ద విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహా నగర్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం కాషాయ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ధైర్యానికి భక్తికి సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు ధర్మ పరిరక్షణ భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని దానికి కారణం హిందువులు ప్రతి ఒక్కరిని ఐక్యతగా కలుపుకుని ముందుకు వెళ్లే భావజాలంతో ఉండడం వల్లే తాను గర్వంగా హిందువునని చెప్పుకుంటానని ఎంపీ అన్నారు
పశ్చిమ బెంగాల్ లాంటి చోట కాషాయ జెండా ఎగిరింది అంటే ఇలా అందరూ కలిసికట్టుగా ఉండడమే కారణమని దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ చిన్ని తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహా నగర్ వారిని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.
“తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను” అని ఎంపీ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందువుల భావజాలం ప్రతి ఒక్కరిని ఐక్యతగా కలుపుకుని ముందుకు వెళ్లే విధంగా ఉంటుందని అన్నారు. ప్రేమ, సహనం, సేవ అనే విలువలే హిందూ ధర్మానికి మూలమని పేర్కొన్నారు. అందుకే తాను గర్వంగా హిందువునని చెప్పుకుంటానని తెలిపారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ భక్తి, దేశభక్తి, ధర్మ పరిరక్షణపై ప్రసంగించారు. యువత భారతీయ సంస్కృతిని కాపాడటంలో ముందుండాలని సూచించారు. సమాజంలో మంచి విలువలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, విజయవాడలో ప్రతి సంవత్సరం నిర్వహించే హనుమాన్ శోభాయాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు కూటమి నేతలు పెద్ద సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు





