హైడ్రా కీలక నిర్ణయం.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు

Must read

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రక్రియలో నివాసాలు కోల్పోతున్న నిరుపేదల పట్ల మానవతా దృక్పథంతో ముందుకు సాగుతోంది. చెరువులను ఆక్రమించిన బడా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే, జీవనోపాధి కోసం నగరానికి వచ్చి గుడిసెలు వేసుకున్న పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ విషయాన్ని ఏవీ రంగనాథన్​ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు పరిసరాల్లో నివసిస్తున్న బాధితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

చెరువుల ఆక్రమణల సమస్య నగర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. వర్షాకాలంలో వరదలు, నీటి నిల్వ సమస్యలు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక సమస్యలు ఈ ఆక్రమణల వల్ల ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులను పునరుద్ధరించడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో నిజంగా పేదలైన కుటుంబాలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ లక్ష్యంతో బాధితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా 2024 జూలై 19 తేదీని కటాఫ్‌గా నిర్ణయించి, ఆ తేదీకి ముందు నుంచే అక్కడ నివాసం ఉంటున్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాలను ఆధారంగా తీసుకుని జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం వల్ల అర్హులైన పేదలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

ఈ సాంకేతిక పద్ధతి ద్వారా పేదల ముసుగులో లబ్ధి పొందాలని ప్రయత్నించే కబ్జాదారులను గుర్తించి అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. చెరువుల వద్ద నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని సమగ్రంగా పరిశీలించి, నిజంగా అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించారు.

నగరవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇదే విధానం వర్తిస్తుందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగించే అవకాశముంది. పేదలకు భద్రమైన నివాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరించబడితే నగరంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు వరద సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలనే ప్రభుత్వ సంకల్పం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!