టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం

Must read

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. యువనేత, మంత్రి నారా లోకేష్​ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్‌తో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులతో కూడా చంద్రబాబు ప్రమాణం చేయించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేపట్టిన ఈ చర్యకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది.

పార్టీ నిర్మాణంలో ఈసారి ‘పాత-కొత్త’ కలయికకు టీడీపీ పెద్దపీట వేసింది. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను పొలిట్‌బ్యూరోలో కొనసాగిస్తూనే, యువతకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం ద్వారా సమతుల్యతను సాధించే ప్రయత్నం చేసింది. ఇది పార్టీ భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.

ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా మండల, క్లస్టర్ స్థాయి నాయకులకు కూడా పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించడం విశేషంగా నిలిచింది. సాధారణ కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలడనే బలమైన సందేశాన్ని పార్టీ ఈ చర్య ద్వారా పంపింది. ఈ నిర్ణయం గ్రామ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

లోకేశ్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించే కార్యక్రమాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, గ్రౌండ్ లెవెల్‌లో బలోపేతం వంటి అంశాల్లో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, లోకేశ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు పార్టీకి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!