మే 1న ‘ఏక్ దిన్’ విడుదల

Must read

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘ఏక్ దిన్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

కథానాయకుడు రోహన్ (జునైద్ ఖాన్) తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)పై ప్రేమలో పడతాడు. అయితే తన భావాలను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేకపోతాడు. ఇదే సమయంలో వారి కార్యాలయ బాస్ (కునాల్ కపూర్) కంపెనీ టార్గెట్లు పూర్తయ్యిన సందర్భంగా మొత్తం టీమ్‌ను జపాన్ ట్రిప్‌కు తీసుకువెళతాడు.

జపాన్‌లో జరిగిన ఒక ప్రమాదంలో మీరా గాయపడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు “ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా (TGA)” అనే అరుదైన న్యూరాలజికల్ పరిస్థితి ఉన్నట్లు నిర్ధారిస్తారు.

ఈ పరిస్థితి వల్ల వ్యక్తి తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారని, సాధారణంగా 24 గంటల్లో మళ్లీ సాధారణ స్థితికి వస్తారని చెబుతారు. ఈ నేపథ్యంలో రోహన్‌కు ఆమెతో ఒక రోజు మాత్రమే గడిపే అవకాశం లభిస్తుంది.

24 గంటల తర్వాత మీరా తనను పూర్తిగా మర్చిపోతుందనే వాస్తవం రోహన్‌ను భావోద్వేగ సంఘర్షణలోకి నెట్టేస్తుంది. ప్రేమను వ్యక్తపరచాలా లేక ఆ జ్ఞాపకాలను కాపాడుకోవాలా అనే సందిగ్ధతే కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న చర్చనీయాంశమైంది నిజంగా 24 గంటల పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధ్యమేనా?

ఈ సందేహంపై గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ స్పైన్ ఛైర్మన్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా ఒక అరుదైన కానీ నిజమైన వైద్య పరిస్థితి అని తెలిపారు. ఇందులో రోగులు కొద్దిసేపు కొత్త జ్ఞాపకాలను నిలుపుకోలేకపోయినా, సాధారణంగా 24 గంటల్లో పూర్తిగా కోలుకుంటారని వివరించారు.

ఇది శాశ్వత జ్ఞాపకశక్తి నష్టానికి భిన్నమని, సాధారణంగా తీవ్రమైన ప్రమాదం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిడి, మైగ్రేన్ లేదా ఇతర కారణాల వల్ల ఇది సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!