అంబేద్కర్ మార్గంలో అభివృద్ధి :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Must read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సమాన అవకాశాల ప్రాముఖ్యతను మరోసారి ప్రస్తావించారు. దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన మార్గమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం, హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

సీఎం తన ప్రసంగంలో మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌లను దేశ నిర్మాణానికి రెండు కళ్లుగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో రక్తపాతం లేకుండా స్వాతంత్ర్య సమరాన్ని విజయవంతం చేయగలమని ప్రపంచానికి చూపించారని చెప్పారు.

అదే సమయంలో అంబేడ్కర్‌ బలమైన రాజ్యాంగాన్ని రూపొందించి, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలకు బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. భారతదేశం ఒక శక్తివంతమైన, సమగ్ర దేశంగా ఎదగడానికి అంబేడ్కర్‌ కృషి కీలకమైందని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గతంలో లేనివిధంగా విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు.

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల స్థాయిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా ఉత్తమ విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!