టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తనదైన శైలిలో విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.‘అల్లుడు శ్రీను’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన సాయి శ్రీనివాస్, ఆ తర్వాత ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘రాక్షసుడు’, ‘సీత’, ‘అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
తన కెరీర్లో కొత్త ప్రయోగంగా ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత విరామం తీసుకుని ప్రస్తుతం మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించాడు.ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, గత కొద్ది రోజులుగా ఆయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ, సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే యువతితో వివాహం జరగనున్నట్లు స్పష్టత వచ్చింది.
ఈ జంట నిశ్చితార్థం ఏప్రిల్ 5న ఘనంగా నిర్వహించనున్నారు. నగర పరిసరాల్లోని ఒక విశాలమైన ఫామ్హౌస్లో ఈ వేడుక జరగనుండగా, ఇరు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఇక వివాహం విషయానికి వస్తే, ఈ జంట తమ పెళ్లిని సాధారణంగా కాకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి దేవస్థానంలో శ్రీవారి సన్నిధిలో వివాహం జరగనుంది. వేద మంత్రాల నడుమ పవిత్రంగా జరిగే ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.సినిమా స్టైల్ గ్రాండ్ వెడ్డింగ్లకు భిన్నంగా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో సాయి శ్రీనివాస్ వివాహం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.





